లండన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

21
- Advertisement -

లండన్ సమీపంలోని రీడింగ్ పట్టణ ఎన్నారై బీ.ఆర్.యస్ పార్టీ కార్యాలయంలో ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యవర్గ సభ్యులంతా కలిసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.రీడింగ్ ఇంచార్జ్ మరియు కార్యదర్శి మల్లా రెడ్డి బీరం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో , ముందుగా ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.తరువాత కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలిపుకొని, కెసిఆర్ జిందాబాద్, మేమంతా కెసిఆర్ వెంటే అంటూ ఎన్నారైలు నినదించారు.

ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ……ఉద్యమ సమయం నుండి మొట్ట మొదటి సారి ఖండాంతరాల్లో లండన్ గడ్డ పై గులాబీ జెండా ఎగరవేసి కెసిఆర్ గారి వెంటే ఉండి స్వరాష్ట్ర సాధనలో మా బాధ్యత నిర్వహించామని, అలాగే నేడు కూడా అదే స్ఫూర్తి తో వారి వెంటే నడిచి తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని నవీన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ప్రజలకు కెసిఆర్ గారి నాయకత్వం – గులాబీ జెండానే శ్రీరామా రక్షా అని, కాబట్టి ప్రజలంతా కెసిఆర్ గారి నాయకత్వాన్ని వదులుకోవద్దని , వారి నాయకత్వంలోనే తెలంగాణ లోని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీ.ఆర్.యస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించి, తెలంగాణ హక్కుల పరిరక్షణ ప్రతినిధులుగా వారిని నియమించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై బీ.ఆర్.యస్ సెల్ ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి బీరం, అధికార ప్రతినిధులు హరి గౌడ్ నవాబుపేట్, ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని, రవి ప్రదీప్ పులుసు, సురేష్ బుడగం, సత్య చిలుముల, సతీష్ రెడ్డి బండ,సత్యపాల్ రెడ్డి పింగిళి, శ్రీకాంత్ జెల్ల, మహేందర్ హాజరైన వారిలో వున్నారు.

Also Read:KCR:అక్కరకు రాని చుట్టం బీజేపీ?

- Advertisement -