రేవంత్‌పై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు

4
- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. మాజీ సీఎం ,బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఓయూలో నీటి కొరత, కరెంట్‌ కోత అంశాన్ని సోమవారం ఎక్స్‌ వేదికగా పోస్టు చేయడం, అది వైరల్‌గా మారడం.. డిప్యూటీ సీఎంసహా వివిధ శాఖల అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్‌ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేవంత్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞ‌ప్తి చేసింది.

ప్రతి సంవత్సరం వర్సిటీ హాస్టళ్లు, మెస్‌లకు సెలవులు ప్రకటించడం సాధారణమేనని, నిరుడు కూడా కరెంటు కోతలు, నీటి కొరత ఉన్నట్టుగా పాత నోటీసును జత చేస్తూ ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఫేక్‌ నోటీసు ఎలా పోస్టు చేస్తారంటూ అసలు నోటీసు ఇది అంటూ పాత నోటీసును జత చేశారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:పుష్ప… ఫుల్ లిరికల్ వచ్చేసింది

- Advertisement -