ట్రంప్‌ కోసం అల్పాహారం.. మెనూ ఇదే..

357
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సకుటుంబ సపరివార సమేతంగా ఇండియాకు వస్తున్నారు. మరికాసేపట్లో అహ్మదాబాద్‌లోని ఎయిర్‌పోర్టుకు ట్రంప్‌ ఫ్యామిలీ చేరుకోనుంది. ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు అహ్మదాబాద్‌ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అహ్మదాబాద్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే ట్రంప్, అక్కడి నుంచి నరేంద్ర మోదీతో కలిసి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొతేరా స్టేడియానికి చేరుకుంటారన్న సంగతి తెలిసిందే. మార్గ మధ్యంలో మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తారు. ఈ సందర్భంగా ట్రంప్, అక్కడే అల్పాహారాన్ని స్వీకరించనున్నారు.

U.S. President Donald Trump

అది గాంధీ ఆశ్రమం కాబట్టి, పూర్తి శాకాహార వంటకాలనే ట్రంప్ కు వడ్డించనున్నారు. ఇక మెనూలో ఫేమస్ గుజరాతీ వంటకాలైన కాజూ కట్లీ, కార్న్ సమోసా, బ్రకోలీ సమోసా, ఖమన్, ఆపిల్ ఫ్రై తదితరాలను ట్రంప్, మెలానియా స్వీకరిస్తారని, వీరికోసం పలురకాల పండ్ల రసాలను సిద్ధం చేశామని సబర్మతీ ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు. కాగా, కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ట్రంప్ సబర్మతీ ఆశ్రమంలో గడుపుతారు. గాంధీ వాడిన పలు వస్తువులను ఆయన సందర్శించనున్నారు. ఆయన గదిని, అక్కడి నుంచి నర్మదా నదిని తిలకించనున్నారు.

- Advertisement -