31న బ్రాహ్మణ సదనం ప్రారంభం..

107
- Advertisement -

ఈనెల 31 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అవడానికి సర్వాంగ సుందరంగా ముస్తాబుతోంది బ్రాహ్మణ సదన్. ఈనెల 17 వ తేదీన జరిగే సమావేశంలో ప్రారంభ సమయాన్ని ఖరారు చేయనుంది బ్రాహ్మణ పరిషత్.

ప్రారంభోత్సవానికి ఎవరెవరిని పిలవాలనే అంశంపై కూడా చర్చ జరపనున్నారు పరిషత్ పెద్దలు. శృంగేరి, పుష్పగిరి, హంపిలతో సహా మరో 6 గురు పీఠాధిపతులను ఆహ్వానించే అవకాశం ఉంది.

Also Read:ఒక మంచి కథ చేశాం: స్వప్న ప్రియాంక దత్‌

పీఠాధిపతులు, ఇతర అతిథులు ఉండటానికి గదులు, భోజన సదుపాయాలతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు, హంగులతో బ్రాహ్మణ సదన్ నిర్మాణం జరగనుంది.పెళ్లిళ్లు, ఉపనాయనాలతో సహా ఇతర శుభకార్యాలు నిర్వహించుకునే విధంగా, 600 మంది కెపాసిటీతో కళ్యాణ మంటపం నిర్మాణం చేపట్టారు.

Also Read:కన్నడనాట మొదలైన హత్య రాజకీయాలు…!

- Advertisement -