కన్నడనాట మొదలైన హత్య రాజకీయాలు…!

57
- Advertisement -

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బీజేపీ నేత హత్య చేయాలని కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. కర్నాటకలోని చిత్తాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ మాట్లాడిన ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఇది తమకు లభించిందని అన్నారు. ఇందులో కాంగ్రెస్‌ మల్లికార్జున ఖర్గేను మరియు అతన్ని కుటుంబం మొత్తంను హత్య చేయాలని తన అనుచరులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ఆ ఆడియో క్లిప్‌లో ఉంది. కన్నడనాట కాంగ్రెస్‌కు లభించే ఆదరణను చూసి తట్టుకోలేకే బీజేపీ నేతలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: “40 శాతం కమిషన్ “..చిక్కుల్లో బీజేపీ !

కన్నడ ప్రజలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్‌ను ఎంతగానో అభిమానిస్తున్నారని అన్నారు. ఇది చూసి బీజేపీ నాయకులు అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హత్యకు ప్లాన్ చేస్తోంది. ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నారని… ఓటమిని ఎదుర్కోలేకే బీజేపీ ఇంతకు దిగజారుతున్నారంటూ రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. ఇప్పటికే కర్నాటకలో బీజేపీపై 40శాతం కమిషన్ అనే మచ్చ ఉంది. దానికి తోడు తాజాగా విడుదలైన ఆడియో క్లిప్‌ ద్వారా బీజేపీకి విజయం దక్కడమంటే నల్లేరు మీద నత్త నడకే అని పలువురు ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.

Also Read: KTR:ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే

- Advertisement -