బ్రహ్మీతో రష్మీ, అనసూయ రొమాన్స్..!

197
online news portal
- Advertisement -

స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని నటుడు బ్రహ్మానందం. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆయన హీరోగా గా కూడా చేశారు. అయితే గతకొంత కాలంగా బ్రహ్మానందం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నవ్వించలేక పోతున్నాడు. దీంతో మళ్లీ హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం సరసన ఇద్దరు భామలు నటించానున్నారట. ఇంతకీ ఎవరా ఇద్దరు భామలు ? అని అనుకుంటున్నారా ? అయితే స్టోరీకి వెళ్లాల్సిందే.

రెండు దశబ్ధాలుగా వెండితెరపై అలుపెరగకుండా నటిస్తున్న ఒకే ఒక కామెడీ ‌కింగ్ బ్రహ్మానందం మరోసారి హీరోగా మూవీ ప్లాన్ చేస్తున్నాడు.గతంలో ఈ స్టార్ కమెడియన్ హీరోగా చాలానే సినిమాలు చేశాడు. ఆ తరువాత కమెడియన్ గానే ఎక్కువగా నటిస్తూ వస్తున్నాడు. ఆ మధ్య జఫ్ఫా మూవీతో మళ్లీ హీరోగా మెరిశాడు. అయితే ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు మరోసారి అందుకోసం ప్లాన్ చేస్తున్నాడు బ్రహ్మానందం. ఇందుకు సంబంధించి స్టోరీ కూడా రెడీ అయ్యిందని సమాచారం. రేపోమాపో సినిమా ప్రారంభిస్తారని
టాక్.

online news portal

ఈ మూవీలోబ్రహ్మీ పక్కన ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ఇందుకోసం హాట్ యాంకర్లు రష్మీ,అనసూయలను ఫైనల్ చేసినట్లు సమాచారం. హాస్యానికి ఎంత స్కోప్ ఉందో ఈ సినిమాలో అందాల ప్రదర్శనకు అంతే స్కోప్ ఉందట. ఇక ఈ సినిమాకు బ్రహ్మానందం స్వయంగా డైరెక్షన్ చేయాలనుకుంటున్నాడు. త్వరలోనే పూర్తి విషయాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -