టీఆర్ఎస్ నేత,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన వృత్తిదర్మాన్ని పాటించి ప్రజాభిమాన్ని పొందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిని ఓ బాధితురాలికి నర్సయ్య గౌడ్ స్వయంగా ప్రథమ చికిత్స చేసి డాక్టర్ గా తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించారు. ఈ సంఘటన ద్వారా ప్రజాసేవకోసం తాను చూపించే నిబద్దతను మరోసారి చాటుకున్నారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద జాతీయ రహదారిపై కార్ టైర్ పేలి డివైడర్ ఢీకొని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది మరో కారు.ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హుటాహుటిన ప్రమాద స్థలం వద్దకు పరుగెత్తి గాయపడ్డ వారికి ప్రధమ చికిత్స అందజేశారు. తన కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ని తెప్పించి క్షత గాత్రులకు రక్తస్రావం కాకుండా చికిత్స అందించారు.
ఈ ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పెనమనుర్ మండలం దొంగనటూర్ గ్రామానికి చెందిన సునీత మృతి చెందారు. సునీత ప్రాణాలు కాపాడటానికి బూర నర్సయ్య గౌడ్ ఎంతో ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఒక వైద్యునిగా బూర నర్సయ్య గౌడ్ తన ఔదార్యాన్ని ,మానవత్వంని చాటుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.