బీజేపీకి షాక్ ఇచ్చిన హీరోయిన్..

265
madhuri dixit
- Advertisement -

2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో సినీమా ప్ర‌ముఖులును రంగంలోకి దింపాల‌నుకున్న ఢిల్లీ నేత‌ల‌కు షాక్ త‌గిలింది. స్టార్స్ ను రంగంలోకి దింపి త‌మ స‌త్తాచాటాల‌నుకున్నారు. 2019 పార్ల‌మెంట్ ఎల‌క్ష‌న్స్ లో పూణె నుంచి బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ను బ‌రిలోకి దింపాల‌ని చూసింది బీజేపీ అధిష్టానం. అందుకు త‌గ్గ‌ట్టుగా ఈ ఏడాది జూన్ లో ఆమెను క‌లిశారు బీజేపీ చీఫ్ అమిత్ షా. పూణె పార్ల‌మెంట్ స్ధానం నుంచి పోటీ చేసే విష‌యంపై ఆమెతో చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది.

amith sha madhuri dixit

తాజాగా త‌న రాజ‌కీయ ప్ర‌స్ధానం పై స్పందించింది న‌టి మాధురీ ధీక్షిత్. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాను బీజేపీ టికెట్ పై పోటీ చేయబోవడం లేదని తేల్చిచెప్పింది. తన రాజకీయ ప్రవేశంపై మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పింది. త‌న అభిమానులు ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని చెప్పింది.

- Advertisement -