100స్ధానాలు గెలుస్తాం.. 11న‌ సంబ‌రాలు చేసుకుందాంః మంత్రి కేటీఆర్..

246
ktr
- Advertisement -

డిసెంబ‌ర్ 11న సంబ‌రాలు చేసుకునేందుకు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు రెడీగా ఉండాల‌న్నారు మంత్రి కేటీఆర్. ఈసంద‌ర్భంగా ఇవాళ ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కు స‌హాక‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్యవాదాలు తెలిపారు. దాదాపు వంద స్థానాల్లో గెలుపు తమదేనని, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.

ktr speeech

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ లో అంచ‌నా వేసిన‌దానికంటే ఎక్కువ సీట్లు టీఆర్ఎస్ పార్టీకి రాబోతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. 2/3 వంతు మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నామని అన్నారు. 3నెల‌ల నుంచి టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేసిన కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు ఆయ‌న ధన్య‌వాదాలు తెలిపారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వేను తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని తెలిపారు. గ‌తంలో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌ని ల‌గ‌డ‌పాటి చెప్పారని కానీ రాష్ట్రం ఏర్ప‌డి అద్బుతంగా అభివృద్ది చేసుకున్నామ‌ని చెప్పారు. 2014లో ల‌గ‌డ‌పాటి రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు..2018లో స‌ర్వేల స‌న్యాసం కూడా తీసుకుంటార‌ని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.

- Advertisement -