2022దీపావళి పండగ భారతీయులకు మరిచిపోలేని శుభవార్తలను వినిపిస్తోంది. మొన్నటికిమొన్న పాక్ ఉత్కంఠత రేపే మ్యాచ్లో విక్టరీని సాధించింది. తాజాగా సూమారు 200ఏళ్లు భారతీయులను పరిపాలించిన బ్రిటన్కు…ఒక భారతీయుడు ప్రధాని కావడం వల్ల భారతీయులు ఈ దీపావళి పండుగను మరిచిపోలేకపోతున్నారు. సునాక్ బ్రిటన్ ప్రధాని కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు రిషిని అభినందిస్తున్నారు. బ్రిటన్ ప్రధానిగా రిషిసునాక్ ఎంపికపై బాలీవుడ్ బీగ్బీ ట్వీట్ చేశారు. రిషిసునాక్ ప్రధాని కావడం పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ…తాను రాసిన పోస్ట్ను సోషల్ మీడియాలో అమితాబ్ షేర్ చేశారు.
భారత్ మాతా కీ జై. ఇప్పుడు బ్రిటన్ కొత్త వైస్రాయ్గా మన మూలాలు ఉన్న వ్యక్తి ప్రధానమంత్రిగా ఎంపికవ్వడం సంతోషంగా ఉంది అని ట్విట్టర్లో రిషి సునాక్ను అభినందిస్తూ అమితాబ్ రాశారు. అమితాబ్ పోస్ట్లో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకున్న వారు ఈ పోస్ట్పై ఘాటుగా స్పందిస్తున్నారు. 200 ఏండ్ల బానిసత్వం నేడు ప్రతీకారం తీర్చుకున్నదని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు.