బంగ్లాలో పడవ ప్రమాదం…27 మంది మృతి

228
boat accident
- Advertisement -

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షితలాఖ్య నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకోగా 27 మంది మృతిచెందారు. 100 మందికి పైగా ప్రయాణీకులతో వెళుతున్న పడవ ఎంఎల్‌ సబిత్‌ అల్‌ హసన్‌ మరో కార్గో వెజల్‌ను ఢీకొట్టింది.

పడవతో పాటు కొంత మంది నీటిలో పడిపోగా కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నారు. ఆదివారం 22 మృతదేహాలను వెలికితీయగా, మరో 5 మృతదేహాలను సోమవారం వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ వెలికితీత కార్యక్రమంలో నేవీ, కోస్ట్‌ గార్డ్, ఫైర్‌ సర్వీస్, పోలీసు బలగాలు పాల్గొన్నాయి.

- Advertisement -