టీఆర్ఎస్‌ఎల్పీలో గిఫ్ట్ ఏ స్మైల్..తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం

423
ktr birthday vinay bhaskar
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్. వినయ్ భాస్కర్ , ధర్మా రెడ్డి , కర్నె ప్రభాకర్ ,చిరుమళ్ల రాకేష్ కుమార్ ,గ్యాదరి బాలమల్లు , కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పిలుపునకు స్పందించి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆపదలో ఉన్న ముగ్గురికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు .తన నియోజకవర్గానికి చెందిన వి .నవ్య అనే పేద విద్యార్థిని (ఇంజినీరింగ్ )ఉన్నత చదువుల కోసం)లక్ష రూపాయలు ,తెలంగాణ ఉద్యమం సందర్భంగా గాయపడ్డ శివ ,రాజు లకు చెరో లక్ష రూపాయలను వినయ్ భాస్కర్ అందజేశారు.కేటీఆర్‌ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపును పలువురు అభినందించారు .వినయ్ భాస్కర్ ఉదారత ను వక్తలు కొనియాడారు.

తెలంగాణ భవన్ లో టిఆఎస్ఎస్వీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్,దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి,గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -