ప్రియురాలి తండ్రి పరీక్ష.. యువకుడు మృతి..

190
Youth-BJP-leader-shoots
- Advertisement -

నేటి కాలం ప్రేమికులలో ఆకర్షణ, మోజు మాత్రమే ఉన్నాయని పెద్దలు చాలా మంది అంటుంటారు. కానీ తనది మాత్రం నిజమైన ప్రేమ అని నిరూపించాడు మధ్యప్రదేశ్ కి చెందిన ఓ యువకుడు. నీది స్వచ్ఛమైన ప్రేమ అయితే కాల్చుకుని చనిపోవాలన్న ప్రియురాలి తండ్రి మాట ప్రకారం, తనను తానే కాల్చుకుని చనిపోయాడు. భోపాల్ లోని అరోరాలో నివసిస్తున్న అంతుల్ లఖండే అనే యువకుడు బీజేవైఎం మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న బ్యాంక్ ఉద్యోగినితో ప్రేమలో పడ్డాడు.

BJYM Leader 'Atul Lokhande'

వీరి పెళ్లిక అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు. ఇదే క్రమంలో ఆ ప్రాంతం నుంచి ఎంపీనగర్ కు షిఫ్ట్ అయ్యారు అమ్మాయి కుటుంబం. అక్కడికి కూడా అతుల్ వెళ్లి, అమ్మాయి తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఆ అమ్మాయి తండ్రి నీ ప్రేమలో నిజాయితీ లేదు, నీది ఆకర్షణ మాత్రమే అని యువకుడితో వారించాడు. నిజమైన ప్రేమ అని తెలియాలంటే ఏం చెయ్యాలని, ఆ యువకుడు అడగగా.. తుపాకీతో కాల్చుకుని నీ ప్రేమ నిజమైందని నిరూపించుకో.. ఒకవేళ బతికితే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని, చనిపోతే వచ్చే జన్మలో తనని పెళ్లి చేసుకో అని చెప్పాడు.

అనంతరం తన ఇంటికి వెళ్లిన అతుల్, తన ప్రేమ నిజమైందని నిరూపించుకుంటానని, ఆమె లేకుండా నేను బ్రతకలేనని, తన ప్రియురాలిని ఎవరూ నిందించవద్దంటూ తనతో దిగిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. మరో జన్మలోనైనా తనతో కలిసి ఉండాలని ఉందని పోస్టులో పేర్కొన్నాడు. నిన్న రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లి కాల్చుకుని చనిపోయాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అమ్మాయి తండ్రిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

- Advertisement -