మోదీకి షాక్‌..పేరు రాసేందుకు భయపడుతున్న కాషాయ నేతలు!

201
modi
- Advertisement -

సర్వరోగ నివారణి జండూభామ్ అన్నట్లు 2014లో ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం,అవినీతి లేని భారతం, కార్పొరేట్లకు చెక్‌ ఇలా.. అన్ని సమస్యలకు పరిష్కారం మోదీనే అన్నట్లు ఉదరగొట్టారు. ఏ మీడియా,సోషల్ మీడియా,పేపర్ చూసినా మోదీ నామ జపమే. ఫలితంగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఇదంతా గతం.

సరిగ్గా ఏడు సంవత్సరాలు గడిచిందో లేదో ఇప్పుడిప్పుడే మోదీ సార్ నిజస్వరూపం బయటపడుతోంది. ఓ వైపు ఆకాశన్నంటుతున్న ధరలు,సెంచరీకి చేరువలో పెట్రోల్ ధరలు, మండుతున్న గ్యాస్ ఇలా ఒక్కటేమిటి సామాన్యుడికి బ్రతుకే పెనుభారంగా మారిన పరిస్ధితి ఏర్పడింది. ఏ నోటితో అయితే మోదీ…మోదీ అని నినాదాలు చేశారో ఇప్పుడు వారే మోదీ గో బ్యాక్ అంటూ నినదిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు.

ఈ ఎన్నికలు జరగుతున్న రాష్ట్రాల్లో బీజేపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రజల నుండి ఉహించని వ్యతిరేకత వస్తోంది. దీంతో ఇప్పుడు మోదీ పేరు రాసేందుకే భయపడుతున్నారు కమలనాథులు. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేతో కలిసి బరిలో దిగుతున్న బీజేపీ…మోదీ పేరుకు బదులు అమ్మ జయలలిత, ఎంజీఆర్ పేర్లనే వాడుకుని ప్రచారం చేస్తోంది. బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న చోట మోదీకి బదులు అన్నాడీఎంకే నేతల పేర్లను వాల్ రైటింగ్ రాస్తూ బీజేపీకి ఓటేయమని అర్థిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా #GoBackModi అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -