అభివృద్ధికి అడ్డుపడుతోన్న బీజేపీ: ఎర్రబెల్లి

62
errabelli
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ పార్టీ అడ్డుపడుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల అభివృద్ది పనుల పురోగతి పై ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన అధికారులు ప్రజా ప్రతి నిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులు..తిరిగి రాష్ట్రానికి వస్తున్న నిధుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీయార్ పెద్ద పీట వేస్తున్నారని కొనియాడారు. క్షేత్ర స్థాయిలో అభివృద్ది పనులకు అధికారులు ముందుండాలని సూచించారు.

- Advertisement -