ఆ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఎన్‌పీఎఫ్‌ పార్టీ…

180
BJP to form govt in Manipur with NPF
- Advertisement -

చిన్న పార్టీల మద్దతు కూడగట్టుకొని భాజపా మణిపూర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఎన్‌పీఎఫ్‌ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ నజ్మా హెప్తుల్లాతో భేటీ అయ్యారు.

వారు భాజపాకి మద్దతు ఇస్తున్నామని గవర్నర్‌కి తెలిపినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. మణిపూర్‌లో ఎన్‌పీఎఫ్‌ నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది.  కాంగ్రెసేతర పార్టీకి మద్దతు ఇస్తామని గతంలో ఎన్‌పీఎఫ్‌ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉంటామని ప్రకటించారు. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్‌.బిరెన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన ఎన్నికను పార్టీ పరిశీలకునిగా నియమితులైన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు.

- Advertisement -