BJP: 9 మందితో బీజేపీ మూడో జాబితా

22
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మూడో జాబితాను రిలీజ్ చేసింది బీజేపీ. 9 మందితో జాబితాను రిలీజ్ చేయగా ఈ తొమ్మిది స్థానాలూ తమిళనాడులోవే. తెలంగాణ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందర రాజన్‌కు చెన్నై సౌత్‌ లోక్‌సభ సీటును కేటాయించారు.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు కోయంబత్తూర్‌, కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌కు నీలగిరి(ఎస్సీ), కేంద్ర మాజీ మంత్రి పోన్‌ రాధాకృష్ణన్‌కు కన్యాకుమారి స్థానాలు కేటాయించారు. చెన్నై సెంట్రల్‌ నుంచి వినోజ్‌ పీ సెల్వమ్‌, వెల్లూర్‌ నుంచి ఏసీ షణ్ముగం, కృష్ణగిరి నుంచి సి. నరసింహన్‌, పెరంబలూర్‌ నుంచి టీఆర్‌ పారివేందర్‌, తూత్తుకుడి నుంచి నైనార్‌ నాగేంద్రన్‌ లోక్‌సభకు పోటీ చేయనున్నారు.

తొలి జాబితాలో 194 మంది, రెండో జాబితాలో 72 మంది పేర్లను ప్రకటించింది. మూడు జాబితాల్లో కలిపి ఇప్పటి వరకు 275 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.

Also Read:లిక్కర్ స్కాం..సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

- Advertisement -