- Advertisement -
2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి కూడా ఎన్డీయే కూటమి అధికారం లోకి రావడం ఖాయం అని పలు సర్వేలు చెబుతున్న విషయం తెలిసిందే. బీజేపీ సొంతంగా అధికారంలోకి రాకపోయినా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు బీజేపీ అధిష్టానం. తాజాగా బీజేపీ జాతియ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే అని ఓ ఇంటర్యూలో చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ రావడం కష్టమేనని ఆయన అన్నారు. ఇప్పడు రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు 2014ఎన్నికల్లో మోడీ హవా నడిచిందని…2019 ఎన్నికల్లో మోడీ సునాని నడుస్తుందని చెప్పారు.
- Advertisement -