- Advertisement -
హిమాచల్ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 62 ఏళ్లు. ఎంపీ స్వరూప్ శర్మ ఆరు నెలలుగా డిప్రెషన్లో ఉండగా చికిత్స తీసుకుంటున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నా ఆయన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య .. చార్థామ్ యాత్రలో ఉన్నట్లు తెలుస్తోంది.
మండీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన 2014లో ఆయన తొలిసారి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలకు చెందిన స్టాండింగ్ కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఎంపీ రామ్ స్వరూప్ శర్మకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
ఇటీవలె మహారాష్ట్ర దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్లో మోహన్ సూసైడ్ చేసుకున్నారు.
- Advertisement -