రాజ్య‌స‌భ‌కు కె.లక్ష్మణ్‌

80
laxman
- Advertisement -

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన అధిష్టానం తాజాగా ఆ పార్టీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, కె.లక్ష్మణ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసింది.

ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆయ‌న పేరును ప్ర‌క‌టించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయ‌గా మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సిరోయ, ఉత్తరప్రదేశ్ నుంచి మిథిలేష్ కుమార్ పేర్లను ప్రకటించింది.

లక్ష్మణ్ తెలంగాణ బీజేపీ చీఫ్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

- Advertisement -