బీజేపీది ట్రబుల్ ఇంజన్ సర్కార్..

145
- Advertisement -

బీజేపీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు మంత్రి హరీష్ రావు. జహీరాబాద్‌లో రూ.97 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనుల పైలాన్‌ని మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ..ఉద్యోగాలు ఊడగొట్టేది బీజేపీ అయితే ఉద్యోగాలు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ అన్నారు. పన్నులు పెంచేది బీజేపీ అయితే పనులు చేసుడు బీఆర్ఎస్ పార్టీ పని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ అన్ని అమ్మేయడమే పనిగా పెట్టుకుంది విమర్శించారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన్రు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులను అర్దాంతరంగా తీసేవారని ఆరోపించారు. సంగారెడ్డిలో ఉన్న ఓడీఎఫ్‌ ఫ్యాక్టరీ భూముల్ని కేంద్రం అమ్ముతుందని మండిపడ్డారు.

వైద్య సీట్లలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరిందని, రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లకు కటాఫ్‌ మార్కులు భారీగా తగ్గాయని తెలిపారు. 8.78లక్షల నీట్‌ ర్యాంకుకు రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీటు వస్తుందని అన్నారు. కొత్తగా 8 వైద్య కళాశాలలతో మరో 1,150 సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు హరీష్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -