వార్నర్..డబుల్ సెంచరీ

210
- Advertisement -

మెల్ బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ఇరగదీశాడు. డబుల్ సెంచరీతో రాణించాడు. 254 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు.

డబుల్ సెంచరీ చేసిన తర్వాత నడవడాఇకి ఇబ్బంది పడటంతో ఫిజియో సాయంతో గ్రౌండ్‌ని వీడాడు. ఇక వార్నర్ డబుల్ సెంచరీ చేయడంతో స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.

ఇక వార్నర్‌ని వందో టెస్టు కాగా వందో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు వార్నర్. అంతకముందు ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 3 వికెట్లు కొల్పోయి 366 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 36, అలెక్స్ క్యారీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -