తెలంగాణ సీఎంను రాజకీయంగా ఎదుర్కొలేక బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు. బీజేపీ పార్టీ బతుకంతా ఫేక్..లీక్ లేనని అన్నారు. తమ స్వార్థ రాజకీయ అవసరాల కోసం బీజేపీ నాయకులు పేపర్ లీక్ చేసి విద్యార్థులను తల్లిదండ్రలను ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేసి అడ్డంగా దొరికిన బీజేపీ పార్టీ నేతలు బండిసంజయ్ని వెనకేసుకురావడం సిగ్గు చేటని అన్నారు.
ప్రజలంతా గమనిస్తున్నారని..రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ది చెప్తారని అనిల్ తెలిపారు. లీకేజీ వ్యవహారంలో ఉన్న ప్రతిఒక్కరిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు ఎటువంటి చేందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం మీ వెంట ఉంటుందని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే బండి సంజయ్ ఎంపీగా కొనసాగే అర్హత లేదని అనిల్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి…