టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు..

88
trs
- Advertisement -

జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఖాళీ అయ్యాయి. ఆ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో సోమవారం టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి కొప్పుల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగ ఆహ్వానించారు. టీఆర్ఎస్‌లో చేరిన వారిలో మారుతి రెడ్డి,కిరణ్,వినయ్, అశోక్, సలీం, శేఖర్,సారయ్య,మల్లయ్య తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు కృష్ణమోహన్ రావు, మాజీ మార్కెట్ కమిటీ సమ్మిరెడ్డి, కౌన్సిలర్ సదానందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -