BJP:జీవన్ రెడ్డిపైఈసీకి ఫిర్యాదు

10
- Advertisement -

ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీజేపీ. కేంద్ర హోంమంత్రి అమిత్ మార్ఫింగ్ వీడియోను జీవన్ రెడ్డి ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని పేర్కొంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే SC, ST, OBC రిజర్వేషన్లు ఎత్తేస్తాం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని..ఇందుకు సంబంధించి ఫేక్ వీడియోని ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

ఇక సీఎం రేవంత్ రెడ్డి దగ్గరి నుండి మంత్రుల వరకు బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు వివరిస్తున్నారు. రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారు.

ప్రధానంగా బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పడంతో దీనిపై కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా మార్ఫింగ్ వీడియోను ప్రదర్శిస్తున్నంటూ ఫిర్యాదులో పేర్కొంది.

Also Read:విశ్వంభర..యాక్షన్ సీన్స్‌ అదుర్స్!

- Advertisement -