ధవళ సత్యం దర్శకత్వంలో దాసరి బయోపిక్..

170
Dasari biopic
- Advertisement -

గతకొంత కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు బయోపిక్ లు తెరకెక్కాయి. ఎందరో ప్రముఖుల జీవితాలను దర్శకనిర్మాతలు తెరకెక్కించారు. తాజాగా మరో లెజెండ్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు టాలీవుడ్ రెడీ అవుతోంది. అదిమరెవరో కాదు దిగ్గజ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ధవళ సత్యం దర్శకత్వం మహించనున్నారు. ఇమేజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తాడివాక రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నటీనటులను ఎంపిక చేసే పని కొనసాగుతోంది. ఈ సినిమాకు ‘దర్శకరత్న’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించబోతున్నారు. 1947లో దాసరి నారాయణరావు జన్మించారు. 1972లో ‘తాత మనవడు’ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరగా దర్శకత్వం వహించిన సినిమా ‘ఎర్ర బస్సు’. 2017లో అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు.

- Advertisement -