బీహార్‌లో 16 నుండి లాక్‌ డౌన్‌!

211
bihar
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు 25 వేలకు పైగా నమోదవుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తుండగా కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అంతరాష్ట్ర సర్వీసులను నిలిపివేయగా బెంగళూరులో వారం రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది.

తాజాగా బీహార్‌లో మళ్లీ లాక్ డౌన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించి నితీష్ సర్కార్. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్…ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు.

బీహార్‌లో ఇప్పటివరకు 18,853 కేసులు నమోదుకాగా గత 24 గంటల్లో 1432 కేసులు న‌మోదయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 12364 మంది కరోనా నుండి కొలుకున్నారు.

- Advertisement -