BB6..రచ్చరచ్చ చేసిన గీతూ

122
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 52 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 52వ ఎపిసోడ్‌లో భాగంగా గీతూ రచ్చ రచ్చ చేసింది. టాస్క్‌లో వెనుకబడటంతో ఆగంఆగం చేసింది. రేవంత్ వల్లే తన గేమ్ పోయిందని గీతూ అర్ధరాత్రి రేవంత్ చేపల్ని దొంగలించడానికి ప్రయత్నించి విఫలమైంది. తర్వాత మెరీనాతో గొడవపడింది గీతూ.

ఇక మళ్ళీ చేపల టాస్క్ ప్రారంభమవడంతో ఈ సారి గీతూ, ఆదిలని సంచాలకులుగా చేశారు. అయితే గీతూ చేపలు పడుతుంటే సంచాలకులుగా ఉన్నవాళ్లు చేపలు పట్టకూడదు అని ఆది చెప్పినా పట్టించుకోలేదు. ఫైమాకి గోల్డ్ కాయిన్ దొరకడంతో నెక్స్ట్ టాస్క్ లో ఎవరెవరు ఉండొచ్చో ఫైమా నిర్ణయిస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. సూర్య- వాసంతి, ఆదిత్య- మెరీనా, శ్రీసత్య- శ్రీహాన్‌ జంటలు పోటీకి దిగుతాయని చెప్పగా ఈ ఛాలెంజ్‌లో సూర్య- వాసంతి టీమ్‌ గెలిచి 15 చేపలు గెలుచుకుంది.

ఇక చివరగా చేపల చెరువు టాస్క్‌ ముగిసే సమయానికి శ్రీసత్య- శ్రీహాన్‌ 67, రేవంత్‌- ఇనయ 129, ఫైమా- రాజ్‌ 109, సూర్య- వాసంతి 89, రోహిత్‌- కీర్తి 84, బాలాదిత్య- మెరీనా -37 చేపలు సంపాదించారు. అయితే నల్ల చేప దొరికిన వాళ్ళు రెండు జంటల చేపలను స్వాప్‌ చేయొచ్చని బిగ్‌బాస్‌ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇదే టైం అనుకోని గీతూ తనకి దొరికిన నల్ల చేపని బయటకి తీయడంతో అంతా ఆశ్చర్యపోయారు. అందరికంటే తక్కువ చేపలున్న బాలాదిత్య- మెరీనా జంట టాస్క్ నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి…

నయనతార సరోగసిపై ట్విస్ట్

సత్యదేవ్ 26లో సత్యరాజ్

ERROR500…టీజర్ లాంఛ్

- Advertisement -