బిగ్ బాస్ 5: ఎపిసోడ్ 84 హైలైట్స్

106
- Advertisement -

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 షో ప్రయాణం ముగింపునకు చేరుకుంటోంది. చివరి మజిలీకి చేరుకున్న హౌస్‌మేట్స్‌ ఎవరికి వారు టాప్‌ 5పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో కింగ్‌ నాగార్జున ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కంటెస్టెంట్ల కోసం మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ స్టేజీపైకి వస్తారని చెప్పాడు. కానీ వాళ్లు మిమ్మల్ని కలవాలంటే మీకు బాగా నచ్చిన వస్తువులను త్యాగం చేయాలని మెలిక పెట్టాడు. అయినవాళ్లను చూడటం కన్నా విలువైనది ఏముంటుందనుకున్న హౌస్‌మేట్స్‌ అందుకు ఓకే అనేశారు. బంధానికి త్యాగం అనే టాస్క్‌లో మొదటగా యాంకర్‌ రవి పాప బొమ్మను త్యాగం చేయడంతో అతడి తల్లి ఉమాదేవి స్టేజీపైకి వచ్చింది.

ఫ్యామిలీ అంతా నిన్ను చూసి గర్వపడుతుందని నువ్వు బిగ్‌బాస్‌ హౌస్‌కు రాజువని మెచ్చుకుంది. రవి కోసం బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ విన్నర్‌ శివబాలాజీ కూడా షోకి విచ్చేశాడు. హౌస్‌లో ఎవరికి సపోర్ట్‌ చేయొద్దని, నీకు చెప్పాలనిపించిన పాయింట్‌ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. అనంతరం ఉమావేవి.. రవి, సన్నీ, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, మానస్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని చెప్పుకొచ్చింది.

తరువాత ప్రియాంక త‌న మేక‌ప్ కిట్ త్యాగం చేసింది. దీంతో ఆమె కోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. నన్ను కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి కామెడీ షో చేయించారు.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం అప్పారావు అని చెబుతూ ప్రియాంక ఎమోష‌న‌ల్ అయింది. వారు ప్రియాంక‌ని విన్న‌ర్‌గా డిసైడ్ చేస్తూ సన్నీ, శ్రీరామ్‌, రవి, మానస్‌లను టాప్‌ 5లో ఉంచారు.

ఇక స‌న్నీ తనకు ఫ్రెండ్స్‌ ఇచ్చిన స్పెషల్‌ గిఫ్ట్‌ను త్యాగం చేయగా ఫ్రెండ్స్‌ నిఖిల్‌, వెంకట్‌ స్టేజీపై సందడి చేశారు. వారు నానా హంగామా చేశారు. అద్భుతంగా ఆడుతున్నావు. అలానే కంటిన్యూ చేయి అంటూ సన్నీని విన్నర్‌ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్‌, మానస్‌, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు.

ఇక మానస్‌.. తల్లి పంపిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయడంతో మానస్‌ తండ్రి వెంకట్‌రావు, ఫ్రెండ్‌ అమర్‌దీప్‌ వచ్చాడు. అమ‌ర్ దీప్.. మాన‌స్ గొప్ప త‌నాన్ని తెలియ‌జేశాడు. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కార‌ణం మాన‌స్ అని అన్నాడు. ఏమీ లేనివాడిని తీసుకొచ్చి అన్నీ ఉన్నవాడిలా చేశాడు అంటూ మానస్‌ను ఫస్ట్‌ ప్లేస్‌లో సన్నీ, కాజల్‌, శ్రీరామ్‌, షణ్ముఖ్‌ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు.

ఇక కాజల్‌ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్‌ లిప్సిక కూడా వచ్చారు. వీళ్లు కాజల్‌ను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు.

అనంతరం శ్రీరామ్‌.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్‌, రవి, ప్రియాంక సింగ్‌, సన్నీ, షణ్ముఖ్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని జోస్యం చెప్పారు.

చివరగా షణ్ముఖ్‌.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను త్యాగం చేశాడు. అతడి కోసం మొదట అన్నయ్య సంపత్‌ రాగా తర్వాత దీప్తి సునయన ఎంట్రీ ఇచ్చింది. దీంతో షణ్ను ఆనందంలో మునిగిపోయాడు. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్‌ అయిపోవద్దని దీప్తి సూచించింది. నాకు నువ్వేంటో తెలుసంటూ అతడికి ముద్దులు పంపించింది. షణ్ముఖ్‌, శ్రీరామ్‌, సన్నీ, రవి, మానస్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఫినాలేలో కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది. ఈరోజు వచ్చిన మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్‌ సన్నీని టాప్‌ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెడుతూ అతడే విన్నర్‌ అని చెప్పకనే చెప్పారు.

- Advertisement -