చిరు ‘ఆచార్య’పై బాలయ్య ఆసక్తికర కామెంట్స్‌..

115
- Advertisement -

నందమూరి నటసింహం హీరో బాలకృష్ట నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం సాయంత్రం జరిగింది. అయితే ఈ వేడుకలో బాలయ్య చిరంజీవి సినిమా ప్రస్తావన తేవడంపై అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇండస్ట్రీలో వరుసగా రాబోతున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని.. సినిమా పరిశ్రమ మళ్లీ పుంజుకోవాలన్నట్లుగా బాలకృష్ణ మాట్లడాడు. తనకు అలవాటైన రీతిలో శ్లోకాలు, బీజాక్షరాలు, నవ విధాన పూజలను అలవోకగా పఠించారు బాలయ్య. ఈ క్రమంలో తనపై తానే జోక్ విసురుకున్నారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో షో చేస్తున్నానని, ఇదే విధంగా భవిష్యత్తులో ఓ భక్తి చానల్లో ప్రవచనాల తరహాలో ఓ షో చేస్తానని చమత్కరించారు.

ఇక అఖండ చిత్రం గురించి తాను ఎక్కువగా చెప్పనని, ఎలా ఉంటుందో మీరు చూస్తారని పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పవారని, తమ్ముడు అల్లు అర్జున్ ఇంతకుముందే తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకతను వివరించారని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశీర్వదిస్తారని బాలకృష్ణ పేర్కొన్నారు. నటుడు ఏ పాత్ర అయినా చేస్తాడని, నటన అంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమేనని, శ్రీకాంత్ అలవోకగా నటించారని కొనియాడారు.

తన అఖండ చిత్రాన్ని మాత్రమే కాకుండా అల్లు అర్జున్ నటించిన పుష్ప, చిరంజీవి నటించిన ఆచార్య, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా ఆదరించాలని బాలయ్య తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలోనే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నానని, ఏ సినిమాకైనా తాను కష్టపడే విధానంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలు ఎంత వరకు ఈ సినిమా రీచ్ అవుతుందో చూడాలి.

- Advertisement -