Bigg Boss 8 Telugu: అభయ్ ఎలిమినేట్

1
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుంది. మూడో వారం హౌస్ నుండి అభయ్ ఎలిమినేట్ అయ్యారు. అభయ్ ఎలిమినేట్ అవ్వడంతో నిఖిల్, సీత, సోనియా బాగా ఫీలయ్యారు. ముఖ్యంగా సీత అయితే బాగా ఏడ్చింది.

ఇక తర్వాత స్టేజ్ మీదకు వెళ్లిన అభయ్… జర్నీని చూపించారు నాగార్జున. తనకు జీవితంలో ఎప్పుడూ ఒకటే సార్.. ఎప్పుడైనా సరే నీకు డాడీ కావాలా.. సక్సెస్ కావాలా అంటే డాడీనే కావాలి అనేటోడిని అని చెప్పారు. అలాంటి నాకు మా నాన్న గుర్తుగా మిగిలింది ఆ వాచ్ ఒకటే.. వాడు (నిఖిల్) నాకోసం అది ఇచ్చేసరికి.. నేను అడగముందే చెప్పేశాడు నీకు అది ఎంత ముఖ్యమో నాకు తెలుసురా అని అలాంటి వాడికి ఏం ఇచ్చినా తప్పు లేదు అనిపించింది. అందుకే సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నాను అన్నారు.

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ముగ్గురికి బ్లాక్ రోజెస్, ముగ్గురికి రెడ్ రోజెస్ ఇవ్వాలంటూ నాగార్జున చెప్పారు. విష్ణుప్రియకి బ్లాక్ రోజ్ ఇస్తూ కొన్నిసార్లు నువ్వు కొన్ని పదాలు తెలీకుండా అనేస్తావ్.. తర్వాత వచ్చి సారీ చెప్తావ్ అన్నారు. తర్వాత మణికంఠకి కూడా బ్లాక్ రోజ్ ఇస్తూ ఆ దోస దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పాడు. పృథ్వీకి మూడో బ్లాక్ రోజ్ ఇస్తూ.. నిన్ను నేను ఫైనల్స్‌లో చూడాలి.. అందరూ నిన్నే పాయింట్ చేస్తారు అగ్రెషన్ వచ్చిందంటే ఈసారి ఆ చేతులు నీ వైపు చూపించకూడదు అని చెప్పాడు.

తర్వాత నిఖిల్‌కి ,సీత,నబీల్‌కి రెడ్ రోజ్ ఇచ్చారు. అభయ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో 11 మంది సభ్యులు మిగిలారు.

Also Read:#SDT18 కోసం 12 ఎకరాల్లో సెట్!

- Advertisement -