Bigg Boss 8 Telugu:గొడవలు, బూతులు ఇంటి సభ్యుల రచ్చ

0
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 18 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు ఇంటి సభ్యులు. ముఖ్యంగా ప్రేరణ – విష్ణుప్రియ గొడవ చూస్తే చికాకు రాక తప్పదు. కోడిగుడ్ల టాస్క్‌లో నబీల్‌ను సంచాలక్ కాగా గేమ్ మళ్లీ మొదలైంది. తొలుత సోనియా వెళ్లి కాంతార టీమ్ బుట్టలో ఎగ్స్ కొట్టేయగా యష్మీ కూడా వెళ్లి శక్తి టీమ్ గుడ్లు నాలుగు కొట్టేసింది. దీంతో గొడవ ఇక్కడే మొదలైంది. మొదటి రౌండ్‌లో నిఖిల్ టీమ్ 66 ఎగ్స్ కలెక్ట్ చేయగా కాంతార టీమ్ 30కే సరిపెట్టుకుంది.

తర్వాత మూవింగ్ ప్లాట్ ఫామ్ మీద ఓ టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో కాంతార టీమ్ ఎక్కువ పాయింట్లు గెలిచింది. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త రూల్ పెట్టాడు. బిగ్‌బాస్ ఇంటి కిచెన్‌లో ఇక నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్‌లో ఒక్క సమయంలో ఒక్క టీమ్ మాత్రమే వంట చేయాలి. అలానే ఒక టీమ్ వంట చేసేటప్పుడు ఆ టీమ్‌కి సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్‌లో ఉండాలి అని చెప్పాడు.దీంతో ఇంటి సభ్యులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.

కాంతార చీఫ్ అభయ్ బిగ్ బాస్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంతమందికి ముగ్గురు ఎలా వండుతారు ధమాక్ ఉందా, నీయమ్మా సైకోగాళ్లు.. పిచ్చి రూల్స్ అని రెచ్చిపోయాడు. ఆ తర్వాత పద్మావతి రెడ్ ఎగ్ వదిలిపెట్టింది. నిఖిల్ చూసి నైస్‌గా జేబులో వేసుకున్నాడు. తర్వాత మళ్లీ గేమ్ మొదలు కాగానే పృథ్వీ రెచ్చిపోయాడు. ఎగ్స్ ఎవరూ తీసుకోకుండా అందరినీ తోసిపారేశాడు.

ఎగ్స్ కోసం నిలబడినప్పుడు విష్ణుప్రియ-సీత చేయి చేయి పట్టుకొని ప్రేరణను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రేరణ వాళ్ల చేయి పట్టుకొని విడిపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ప్రేరణను తోసేసింది విష్ణుప్రియ. అభయ్‌తో గొడవ సందర్బంగా కోపంతో మైకు విసిరేసి పక్కకెళ్లిపోయాడు మణి.
మొత్తంగా ఈ ఎపిసోడ్ మొత్తం గొడవలు, బూతులతోనే సరిపోయింది.

Also Read:Bigg Boss 8 Telugu: బూతులతో రెచ్చిపోయిన పృథ్వి

- Advertisement -