Bigg Boss 7 Telugu:అలరించిన కార్తి

50
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా సాగుతోంది. ఇక తాజా వారం వీకెండ్ కావడంతో ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగార్జున. ఖైదీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్‌కు రాగా ఇంటి సభ్యులను కార్తికి పరిచయం చేశారు. తర్వాత కార్తీని పంపించేసిన తర్వాత శోభా ఫస్ట్ లేడీ కెప్టెన్ కంగ్రాట్స్ అంటూ నాగ్ పొగిడారు. దీంతో తాను కెప్టెన్ అవ్వడానికి అమర్ కారణమని శోభా మరోసారి అందరి ముందు చెప్పింది. ఇప్పటివరకు ఉన్న కెప్టెన్స్‌లో నువ్వే బెస్ట్ అంటూ గౌతమ్‌ని ప్రశంసించారు.

ఇక తర్వాత తనని అడగాల్సింది ఏమైనా ఉందా అని నాగ్ అనడంతో తేజ పైకి లేచాడు. తర్వాత భోలేని బొగ్గులో పెట్టారు నాగార్జున. నిన్ను అర్జున్ కోసం స్వాప్ చేసేటప్పుడు నువ్వెందుకు పోరాటడలేదు.. ఊరికే వెళ్లిపోయావ్ అంటూ నాగ్ అడిగారు. లేదు సార్ నాకు అవమానం జరిగింది.. అందుకే పోయాను అంటూ భోలే అన్నాడు.

తర్వాత అమర్‌ని లేపి తెగ పొగిడారు నాగార్జున. ఇరగ్గొట్టేశావ్ అమర్.. నీ కోసం కూడా అలానే ఆడు.. అంటూ సలహా ఇచ్చారు.మూడు వారాలుగా నీ ఆటలో విషయం తగ్గింది.. మనుషుల మీద నుంచి ఆట మీదకి కాన్సట్రేషన్ షిఫ్ట్ చెయ్ అంటూ నాగార్జున సలహా ఇచ్చారు. ఇక తేజ కోసం కెప్టెన్సీ టాస్కు చాలా బాగా ఆడావ్ అంటూ ప్రియాంకని మెచ్చుకున్నారు నాగ్. తర్వాత ప్రశాంత్‌ను బంగారంలో పెట్టారు నాగార్జున. నీ ఆట చూసి వాళ్లు భయపడ్డారు కాబట్టే నిన్ను పక్కన పెట్టేశారు.. కానీ ఎందుకు మాటిమాటికి ఏడుస్తున్నావ్.. సింపథీనా అంటూ నాగ్ ప్రశ్న వేశారు.

Also Read:సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచార షెడ్యూల్..

- Advertisement -