Bigg Boss 7 Telugu:ఆకట్టుకున్న ‘మయాస్త్ర’

46
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రెండోవారం హాట్ హాట్‌గా సాగుతోంది. నామినేషన్స్ ప్రక్రియ పూర్తికాగా 11వ ఎపిసోడ్‌ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. మాయాస్త్ర కోసం టీం రణధీర, మహాబలి టీం సభ్యుల మధ్య రసవత్తర పోరు సాగగా శివాజీ ‘బహాబలి’ టీం సభ్యుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు.

టాస్క్‌లో భాగంగా మొదటి దశలో రణధీర టీం సభ్యులు ( శివాజీ, అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, షకీలా) విజయం సాధించి.. మాయాస్త్ర కీ సంపాదించారు. అయితే ఆ కీని కొట్టేయడానికి మహాబలి టీం సభ్యులు ప్రయత్నింగా. శివాజీ వాళ్లకి చుక్కలు చూపించాడు. దామిని, శుభ శ్రీ‌లు తాళం చెవి కొట్టేయడానికి దొంగనాటకాలు ఆడుతుండటంతో దీనిని పసిగట్టిన శివాజీ.. ఏం యాక్టింగ్ చేస్తున్నారు.. ఎవడు చెప్పాడు మీకు తాళం కొట్టేయొచ్చుని ఆ డాక్టర్ గాడు చెప్పాడా? ఆ తాళం చేరాల్సిన చోటికి వెళ్లిపోయింది అంటూ ఒక్కొక్కరి గాలితీసేశారు.

Also Read:రేవంత్ vs రాహుల్ గాంధీ.. హస్తంలో నయా లొల్లి!

తర్వాత శివాజీ పడుకుంటుండగా కీ కోసం దుప్పటిని లాగడానికి ట్రై సింది రతిక. దీంతో శివాజీ గట్టిగా అరవగా దడుసుకుంది. కీ ఇక్కడ లేదని క్లూ ఇస్తా అంటూ రతికతో ఆడుకున్నాడు శివాజీ. గెలవడానికి ప్రయత్నించకుండా కేవలం కీ కొట్టేడానికి బాహుబలి టీం సభ్యులు ఆలోచించి టాస్క్‌లో ఫెయిల్ అయ్యారు. పల్లవి ప్రశాంత్‌ని కూడా ముప్పు తిప్పలు పెట్టాడు శివాజీ. గ్రీన్ మ్యాట్ కింద ఏదో దాస్తున్నట్టుగా యాక్ట్ చేయగా అది చాటుగా చూసిన ప్రశాంత్ కీ కోసం చేయని ప్రయత్నం లేదు.

తర్వాత మలుపులో ఉంది గెలుపు అంటూ రెండో ఛాలెంజ్ ఇచ్చారు. ఇందులో గెలిస్తే మాయాస్త్ర గెలవడానికి మరో కీ లభిస్తుందని చెప్పారు. ఈ టాస్క్‌లోకూడా రణధీర టీం సభ్యులే గెలవడంతో.. వాళ్లని యాక్టివిటీ ఏరియాకి పిలిచి.. మాయాస్త్ర‌తో సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్.

Also Read:ఓటీటీలో దూసుకెళ్తున్న..’ఓ సాథియా’

- Advertisement -