Bigg Boss 7 Telugu:కంటెస్టెంట్స్ హార్ట్ టచింగ్‌ స్టోరీలు

33
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 89 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్స్ లవ్‌ స్టోరీలతో ఆసక్తికరంగా సాగింది. శివాజీ, శోభా శెట్టి, గౌతమ్, అర్జున్, ప్రశాంత్, అమర్ ‌దీప్‌లు తమ ప్రేమ కథల గురించి చెప్పి ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేశారు.

ముందుగా తన లవ్ స్టోరీ చెప్పారు శివాజీ. మాస్టర్ సినిమా తర్వాత ఒక పెద్దాయన ఇంట్లో ఫంక్షన్‌ జరిగితే అక్కడికి వెళ్లగా మా ఆవిడని ఫస్ట్ టైమ్. అలా మాట్లాడుతూ ఒక సంవత్సరం మా లవ్ స్టోరీ నడిచిపోయింది. ప్రతి రోజూ చిక్కడపల్లిలో తను ట్యూషన్‌కి వెళ్లేటప్పుడు కలిసేవాడిని..డిగ్రీ లాయర్‌లో వివాహం చేసుకున్నామని…ఇప్పటికి అదే లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుందని చెప్పాడు.

తర్వాత శోభా శెట్టి తన ప్రేమ కథను చెబుతూ తెగ సిగ్గుపడిపోయింది. మేము అంతగా ఏమీ ఎంజాయ్ చేయలేదు.. పార్కుకి వెళ్లలేదు, సినిమాకి వెళ్లలేదు. అంటే అప్పుడు ఫస్ట్ లాక్ డౌన్ వచ్చింది కదా ఆ టైమ్‌లో సేమ్ షూటింగ్ సెట్‌లోనే మేము వర్క్ చేశాం అని తెలిపింది. లైఫ్‌లో ఏది ఉన్నా లేకపోయినా నువ్వు చాలా ముఖ్యం యశ్వంత్… నువ్వు లేకపోతే శోభా లేదు ఎమోషనల్ అయిపోయింది.

రెండు సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీల తర్వాత గౌతమ్ తన బ్రేకప్ స్టోరీ చెప్పాడు. ఇక్కడ అందరిదీ సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీలేమో నాది మాత్రం ఒక బ్రేకప్ స్టోరీ అని స్టార్ట్ చేశాడు. అర్జున్ కూడా తన లవ్ స్టోరీని చాలా షార్ట్‌గా క్యూట్‌గా చెప్పేశాడు. తర్వాత ప్రశాంత్ స్టోరీ చెప్పాలంటూ బిగ్‌బాస్ అడగ్గా మొదట కాస్త మొహమాట పడిన ప్రశాంత్ తర్వాత తన స్టోరీ స్టార్ట్ చేశాడు.

చివరిగా అమర్‌దీప్ మీ ఫేవరెట్ లవ్ స్టోరీ చెప్పాడు. తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు అమర్. అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 2 రూపాయల దోశలు వేసేవారు అప్పట్లో.. బ్యాచ్ బ్యాచ్ అంతా వెళ్లి తినేవాళ్లం.. అప్పుడు దూరం నుంచి స్కూటీ మీద పర్పుల్ కలర్ మిడ్డీ వేసుకొని పొగ మంచులో నుంచి ఓ అమ్మాయి వచ్చింది.. తర్వాత చిన్న చిన్నగా మాటలు కలిశాయి. ఆ స్టోరీ కాలేజ్ వరకూ వచ్చింది.. తన కోసం వేరే బస్టాండ్‌లో దిగి వెయిట్ చేసే వాడిని అయితే చిన్న మనస్పర్థ వచ్చిన తర్వాత తనతో మాటల్లేవ్.. ఈ స్టోరీ ఇక్కడితో తీసేసెయ్ అంటూ అమర్ ఎండ్ చేశాడు.

Also Read:సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో.. “వధువు”

- Advertisement -