Bigg Boss 7 Telugu:ఈసారి నామినేషన్స్‌లో 8 మంది

34
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 9వ వారంలోకి ఎంటరైంది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది ఉన్నారు. అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, తేజా, భోలే, యావర్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. మంగళవారం నాటి 59వ ఎపిసోడ్‌లో మొదట శోభాశెట్టి రతికను నామినేట్ చేసింది. శోభా – రతిక మధ్య గొడవలో తేజా దూరగా మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావ్ అని చురకవేసింది. ఆ తర్వాత యావర్‌ని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ రేస్ నుంచి తనని తప్పించడం తనకి నచ్చలేదని.. తను చెప్పిన రీజన్ కూడా నచ్చలేదని చెప్పింది శోభాశెట్టి. దీనితో గొడవ ఎందుకు అని అనుకున్నాడో ఏమో కానీ.. యాక్సెప్ట్ అని సైలెంట్‌గా వెళ్లి.. ముఖానికి రంగు కొట్టుకుని వచ్చి నిలబడ్డాడు.

తర్వాత అమర్ దీప్.. అర్జున్‌ని నామినేట్ చేస్తూ సిల్లీ పాయింట్ మీద నామినేట్ చేయొద్దని నువ్వే చెప్తావ్.. కానీ నువ్వే సిల్లీ పాయింట్ మీద నామినేట్ చేస్తావ్ ఏంటన్నా అని అడిగాడు. నేనేం సిల్లీ పాయింట్‌పై నామినేట్ చేశానో చెప్పు? అని అడిగాడు అర్జున్. గౌతమ్‌కి నాకు జరిగిన ఇష్యూలో తప్పుని ఒప్పుకుని నిలబడ్డాను. కానీ అదే పాయింట్‌ని తెచ్చి నన్ను నామినేట్ చేయడం సిల్లీ కదా అన్నా అని చెప్పాడు. తర్వాత తన నామినేషన్‌ని భోలేకి షిఫ్ట్ అయ్యాడు. గత వారం నన్ను నామినేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు.. చాలా బాధతో నామినేట్ చేస్తున్నా.. ఇది రివేంజ్ నామినేషన్ అనుకో ఇంకేదైనా అనుకో.. ఫుల్ స్టాప్ పెట్టేవరకూ ఇది ఇలాగే కొనసాగుతుందన్నాడు. ఈ క్రమంలో భోలే – అమర్ దీప్ మధ్య పెద్ద గొడవ జరిగింది.

మొత్తం వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది ఉండగా గౌతమ్ కెప్టెన్‌ కాబట్టి ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక శివాజీ, ప్రశాంత్‌లను నామినేట్ చేయాలంటేనే ఇంటి సభ్యులంతా భయపడిపోతున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచిచూడాలి..

Also Read:వ‌రుణ్‌ పెళ్లికి అందుకే వెళ్ల‌లేదట

- Advertisement -