వ‌రుణ్‌ పెళ్లికి అందుకే వెళ్ల‌లేదట

35
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లి సందడి మొదలైంది. నేడు ఇటలీలో వీరి వివాహం జరగనుంది. పెళ్లి వేడుకలో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీ జరిగింది. ఇందులో లావణ్య త్రిపాఠి వైట్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించారు. ఇక ఈ పార్టీలో రామ్‌ చరణ్ – ఉపాసన, అల్లు అర్జున్‌ – స్నేహాలు కూడా కలర్‌ ఫుల్‌ గా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఇదిలా ఉంటే.. వ‌రుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళికి మెగా ఫ్యామిలీతో పాటు కొందరు మిత్రులు – సన్నిహితులు ఇప్ప‌టికే ఇట‌లీ చేరుకున్నారు.

అయితే, ఈ వేడుక‌కు రేణు దేశాయ్, పిల్లలు వెళుతున్నారా లేదా అనే సందేహ‌లు వ్య‌క్తమవుతున్నాయి. ఈ విషయంపై తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. తనకు ఇన్విటేషన్‌ వ‌చ్చింది గానీ పెళ్లికి వెళ్ల‌డం లేద‌ని తెలిపారు. ఒకవేళ తాను వెళ్ళినా అక్కడున్న వారు ఇబ్బందిపడే అవ‌కాశం ఉండడంతో దూరంగా ఉంటున్నట్టు ఆమె చెప్పారు. ఐతే, రేణు దేశాయ్ వెళ్తే.. అక్కడ ఇబ్బంది పడేవారు ఎవరు అనేది మాత్రం ఆమె చెప్పలేదు. ఇప్పటికే, పవన్ తన మూడో భార్యతో కలిసి పెళ్ళికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ‘పవర్ స్టార్ మాజీ సతీమణి’గా ఉండటం కూడా తనకు ఇష్టం లేదు అని రేణూ దేశాయ్ ఇప్పటికే స్పష్టం చేసింది.

పైగా రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఇప్పటికే ప్రకటించింది. ఆ మధ్య తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసి, అతని ఫోటోను కూడా రేణు షేర్ చేసింది. రీసెంట్ గా రేణు తన రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నేను రెండో పెళ్లి చేసుకోవడానికి చాలా వెయిట్ చేస్తున్నాను. నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు కూడా ఇష్టమే. ఇంకో రెండేళ్లలో నా రెండో పెళ్లి కచ్చితంగా ఉంటుంది’ అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. మరి తన రెండో పెళ్ళికి మెగా ఫ్యామిలీని పిలుస్తోందో లేదో చూడాలి.

Also Read:Harishrao:సిద్దిపేట ప్రజల గౌరవాన్ని నిలబెడుదాం

- Advertisement -