Bigg Boss 7 Telugu:శివాజీకి పరోక్షంగా నాగ్ చుక్కలు

47
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 7వ వారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. 48వ రోజు  వీకెండ్ కావడంతో ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగార్జున. అమర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నాగ్..శివాజీకి అక్షింతలు వేశారు. మొదట శ్రావణి అనే అమ్మాయితో మాట్లాడారు. చెప్పమ్మా.. నీ ఫేవరేట్ ఎవరు? అని అడిగితే.. శివాజీ అని చెప్పింది శ్రావణి. ఆయన చేతికి గాయం అయినా సరే.. మైండ్ గేమ్ ఆడుతున్నారు అని తెలిపింది. ఇక నచ్చని కంటెస్ట్ ఎవరంటే..ఎవరి పేరు చెప్పలేదు.

తర్వాత సపోటా సాయి అనే ఆడియన్ బిగ్ బాస్‌పై పేరడి సాంగ్ పాడి అలరించాడు. ఇక ఏడోవారంలో కెప్టెన్సీ పోటీదారులుగా అర్జున్, సందీప్‌లు పోటీ పడగా ఇందులో గెలుపొందడంతో కొత్త కెప్టెన్‌ అయ్యారు అర్జున్. గత వారం కేక్ విషయంలో అమర్ దీప్.. అందరికంటే ముందు కేక్ తిన్నాడు. నాగార్జున ఇదే విషయంపై నిలబెట్టి ఎందుకు ప్రతిదాంట్లోనూ కంగారేనా? అని అడగడంతో.. తిడతారేమో అని ప్రతివారం లాగే స్కూల్ కిడ్ అయిపోయాడు అమర్ దీప్. నాగ్ క్లాస్ పీకుతాడని బయపడ్డాడు కానీ అనూహ్యంగా ప్రశంసలు గుప్పించడంతో అమర్ ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి.

అమర్‌ని నాగార్జున పొగుడుతుంటే శివాజీ మొహం మారిపోయింది. నీ మీద కొంతమందికి నమ్మకం లేకపోయినా ఎఫర్ట్ పెట్టావ్.. ఇంకా బాగా ఆడాలి.. ఆ కేక్ నీకు మాత్రమే పంపించాను అని చెప్పారు నాగార్జున. తర్వాత టాటూ గోల తీశారు నాగార్జున. ఏంటి తేజా.. శోభా టాటూ వేయించుకోవచ్చు కదా? అని అడిగారు. టాటూ అంటే చాలా నొప్పి వస్తుందట సార్ అని తెలిపింది.

Also Read:KTR:119 స్థానాల్లో ఈటల పోటీ చేస్తారా?

- Advertisement -