Bigg Boss 7 Telugu:ప్రియాంక వర్సెస్ అమర్

23
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 46 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో ప్రియాంక వర్సెస్ అమర్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా చివరికి నోరు జారి సారీ చెప్పారు అమర్. గులాబీ పురం- జిలేబీ పురం మధ్య తాజా ఎపిసోడ్‌లో రెండు టాస్కులు పెట్టాడు బిగ్ బాస్. ఒకటి ‘అండర్ వాటర్ టాస్క్’ అంటూ స్విమ్మింగ్‌పూల్‌లో పెట్టాడు. ఈ టాస్కులో అమర్ దీప్-సందీప్ ఆపోజిట్ టీమ్స్‌లో పోటీ పడ్డారు. ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరుగగా ఈ టాస్కులో సందీప్ ఉన్న జిలేబీ పురమే గెలిచింది.

నిన్నటి నుంచి ఒక్క గేమ్ కూడా గెలవకపోవడంతో తను ఉన్న టీమ్ గులాబీపురంపై శోభా శెట్టి రంకెలేసింది. తర్వాత స్పేస్ షిప్ ఛాలెంజ్‌లో గులాబీపురం నుంచి గౌతమ్.. జిలేబీపురం నుంచి రైతుబిడ్డ ప్రశాంత్ బరిలోకి దిగారు. ఈ టాస్కులో గౌతమ్ టీమ్ నెగ్గింది. టాస్క్ పూర్తయిన తర్వాత అమర్‌దీప్ – ప్రియాంక మధ్య చిన్న గొడవ జరిగింది.

స్పేస్ షిప్ టాస్కులో ఓడిపోవడంతో ప్రియాంక కూర్చొని ఉండగా అక్కడికి వచ్చిన అమర్…ఒకటే మాకొచ్చింది సల్లబడు ఇంక.. ఒకటేలే అన్నాడు. దీనికి ప్రియాంక రియాక్ట్ అయింది. సల్లబడు ఏందిరా అని ప్రియాంక అంటే రేపటి నుంచి ఇంక సల్లబడాలి అని అమర్ అన్నాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కాగా నోరు జారాడు అమర్‌. అనవసరంగా లేనిపోని దానికి ఎందుకు నువ్వు ఎప్పుడూ నన్నే సపోర్ట్ చేస్తావ్ కదా.. నా టీమ్ గెలిచింది అయినా నేను హ్యాపీగా లేను. నీ టీమ్‌కి నువ్వు న్యాయం చేస్తావ్.. కానీ నువ్వు ఉండేది నా పక్కన అని నాకు తెలీదా అంటూ చివరకు సారీ చెప్పాడు అమర్‌.

Also Read:ఎలక్షన్ రిపోర్ట్: ఈ మూడు చోట్ల ‘బాద్ షా’ లే?

- Advertisement -