Bigg Boss 7 Telugu:శివాజీ – ప్రశాంత్‌లకు 3 స్టార్లు

33
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 31 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఐదోవారం కెప్టెన్సీ టాస్క్ పోటీ ఆసక్తికరంగా సాగగా ఈ ప్రక్రియలో ప్రశాంత్-శివాజీ జోడి గెలుపొందింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా వింత టాస్క్ పెట్టాడు. దొరికితే దొంగ-దొరక్కపోతే దొర అంటూ కొన్ని రూల్స్ పెట్టాడు.

ఈ టాస్క్ ప్రకారం యాక్టివిటీ రూమ్‌లో బిగ్‌బాస్ ఫ్రెండ్ ఒకరు నిద్రపోతూ ఉంటారు. ఇక కంటెస్టెంట్లు సంచెలు పట్టుకొని దొంగల్లా ఆ గదిలోకి దూరాలి. అక్కడ బిగ్‌బాస్ ఇచ్చే హింట్స్ ప్రకారం ఏ వస్తువు గురించి చెప్పారో దాన్ని మాత్రమే దొంగతనం చేసి తీసుకురావాలి. ఇలా ఏ జంట అయితే ఎక్కువ వస్తువులు తీసుకువస్తుందో వాళ్లు ఈ టాస్కులో విజేతలుగా నిలుస్తారని చెప్పారు.

Also Read:అప్పుడే తెలుగు తెర నవ్వు ఆగదు!

టాస్క్ ప్రారంభమైన తర్వాత బిగ్‌బాస్ చెప్పిన హింట్స్ ప్రకారం వస్తువులు తీసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినవి, దొరికినవి తీసి సంచిలో తోసేశారు. అయితే శివాజీ మాత్రం బిగ్‌బాస్ ఇచ్చిన హింట్ ప్రకారం తనకి దొరికిన ఒకే ఒక వస్తువును పట్టుకొని బయటికొచ్చాడు. అయితే టాస్క్ పూర్తయిన తర్వాత కూడా తేజ సంచిలో ఉన్న ఫోన్‌ను లాక్కొని శోభా రచ్చ రచ్చ చేసింది. తేజ జోడి అయిన యావర్.. శోభాను ఎంత అడిగినా ఇవ్వలేదు. దీంతో యావర్ కూడా ఫోర్స్ చేయక తప్పలేదు.

తర్వాత ఎంటరైన బిగ్‌బాస్ అందరికి షాకిచ్చాడు. మీరు నేను అడిగిన వస్తువులే కాకుండా నేను అడగనివి కూడా తెచ్చారు.. కనుక నేను తెమ్మన్నవస్తువులు ఒక వైపు, వద్దు అని చెప్పినా తెచ్చినవి మరో వైపు పెట్టమన్నాడు బిగ్‌బాస్. దొరికినవన్నీ సంచిలో వేసేసిన అమర్-సందీప్, యావర్-తేజ జోడీలు ముందే ఔటయిపోయాయి. ఇక అడిగినవి తప్ప వేరే ఏమీ తేలేదు కాబట్టి శివాజీ-ప్రశాంత్ జోడి మొదటి స్థానంలో నిలిచింది. దీంతో వీరికి 3 స్టార్లు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక ఆ తర్వాత స్థానంలో ఉన్న శోభా-ప్రియాంకలకు 2 స్టార్లు, మూడో స్థానంలో ఉన్న సుబ్బు-గౌతమ్‌లకి ఒక స్టార్ వచ్చింది. దీంతో ఈ టాస్కులో శివాజీ-ప్రశాంత్ గెలిచారు.

Also Read:చంద్రబాబు డైరెక్షన్.. లోకేష్ యాక్షన్!

- Advertisement -