క్వారంటైన్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌..!

334
bigg boss
- Advertisement -

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకోగా ఐదో సీజ‌న్‌కు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబ‌ర్ 5 నుండి ఈ షో ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతుండగా ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే వార్తలప పుకార్లు షికార్ చేస్తున్నాయి.

బిగ్ బాస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్‌ ప్రచారంలో ఉన్నవారిలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేత, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో, మానస్, సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

స్వాతంత్య దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రోమో రిలీజ్ చేయ‌నుండ‌గా, ఆ ప్రోమోలో షో ఎప్పుడు ప్రారంభం అవుతుందో వెల్లడించనున్నారట. ఇక విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 22 నుండి క్వారెంటిన్ లో 15 రోజుల పాటు ఉండేలా సిద్దం చేశారట.

- Advertisement -