అమితాబ్‌కి గాయాలు.. ఏం జరిగింది?

21
- Advertisement -

నేషనల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా, మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె.’ వైజ‌యంతీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఐతే, అమితాబ్ బచ్చన్ ఈ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో అమితాబ్ కి గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌లో చికిత్స తీసుకుని.. ప్రస్తుతం అమితాబ్ ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సిఉంది. ఇక ఈ ‘ప్రాజెక్ట్ K’ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ అయిపోయిందని.. ఆ ఫస్ట్ పార్ట్ నే వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారు. రెండో పార్ట్ ను 2025 లో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే… నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించడానికి నాగ్ అశ్విన్ బాగా కష్టపడుతున్నాడట. మరి ఆ నేపథ్యం ఏమిటో చూడాలి. ఐతే పక్కా సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్ ఉంది. అందుకే, ఈ ‘ప్రాజెక్ట్ కె’ కోసం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే పర్యవేక్షకుడిగా పెట్టుకున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ చాలా బాగుంటాయట. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -