మొక్కలు నాటిన బిగ్ బాస్ ఇనయా…

49
- Advertisement -

బీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించబడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బిగ్ బాస్‌6 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా పాల్తొని మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో ఇనయా సుల్తానా మొక్కలు నాటింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలన్నా ప్రాణవాయువు కావాలన్నా మొక్కలు నాటడం తప్పనిసరి అని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తనను అభిమానించే వారందరూ మొక్కలు నాటి #GreenIndiaChallenge టాగ్‌ చేయాలని కోరారు. ఇదే కార్యక్రమంను ఫైమా రాజ్ వరుణ్ సందేశ్‌ మరియు వితిక లకు ఛాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

ఇవి కూడా చదవండి…

బర్త్ డే..మొక్కలు నాటిన ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి

న్యూ ఇయర్..మొక్కలు నాటుదాం

సునీల్ కనుగోలు పిటిషన్‌..హైకోర్టు కీలక తీర్పు

- Advertisement -