కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ వర్గ విబేధాలు

484
congres
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే ఈసమావేశం రసాభాసగా మారింది.

congres

జనగామ , యాదాద్రి జిల్లా నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. స్వయంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందే గొడవ జరిగింది. ఇదంతా చూస్తూ సైలెంగ్ గా ఉన్నారు ఎంపీ కోమటిరెడ్డి. ఈ సమావేశంలో ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు కుర్చిలు విసురుకున్నారు. చివరకు సమావేశం నుంచి జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు వెళ్లిపోయారు.

- Advertisement -