Tirumala:టీటీడీ ఏర్పాట్లపై భక్తుల సంతోషం

29
- Advertisement -

తిరుమలలో గరుడసేవ సందర్భంగా భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాదాలు, ఇతర సౌకర్యాలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి పరిశీలించారు. గ్యాలరీల్లోని భక్తులతో ముచ్చటించి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలు, తాగునీరు నిరంతరాయంగా అందజేస్తున్నందుకు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు తెల్లవారుజాము నుంచి అంకితభావంతో, భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల సేవలను టీటీడీ ఛైర్మన్, ఈవో కొనియాడారు. దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదాల ప్యాకింగ్, గ్యాలరీలలో అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయడాన్ని అభినందించారు.

టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో నాలుగు మాడ వీధుల్లో భక్తుల సౌకర్యాలను పరిశీలిస్తున్న ఎఫ్‌ఏసీఏవో  బాలాజీ, ఎస్‌వీబీసీ సీఈవో  షణ్ముఖ్‌కుమార్, సీఈ నాగేశ్వరరావు, పీఆర్వో డా.టి.రవి తదితర సీనియర్ అధికారులను అభినందించారు.

Also Read:ఎలక్షన్ రిపోర్ట్: ఈ మూడు చోట్ల ‘బాద్ షా’ లే?

- Advertisement -