చంద్రబాబుకు షాకిచ్చిన మాజీ మంత్రి అఖిలప్రియ..!

232
chandrababu
- Advertisement -

ఏపీ స్ధానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చారు మాజీ మంత్రి,టీడీపీ నేత భూమా అఖిల ప్రియ. ఏపీలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తుందని చంద్రబాబు ప్రకటించగా కొందరు నేతలు మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు.

దీనిపై స్పందించిన భూమా అఖిల ప్రియ…కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. గతంలోనే ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేశారు కాబట్టి.. ప్రచారం కూడా చేస్తారని ఆమె తెలిపారు. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుస్తారని వెల్లడించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మార్చి ఎన్నికలను పరిహాసాస్పదంగా మార్చిన జగన్‌ ప్రభుత్వ వ్యవహార శైలిని నిరసిస్తూ చంద్రబాబు ఎన్నకలను బహిష్కరించగా ఆ పార్టీకి చెందిన నాయకురాలు పోటీలో ఉంటామని ప్రకటించడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -