భీష్మపర్వం..షూటింగ్‌ ప్రారంభం

29
- Advertisement -

రాజు గారి గది, మంత్ర2, విద్యార్ధి, జెంటిల్మెన్ 2 ఫేమ్ చేతన్ చేను కథానాయకుడిగా నూతన దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం”భీష్మ పర్వం”. ప్రేమ్ కుమార్, చేతన్ చేను నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కారక్ర్యమం ఈ రోజు గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ పూజ కార్యక్రమానికి బెక్కం వేణుగోపాల్ అతిధిగా హాజరయ్యి ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. ఎర్రవెల్లి భాస్కర్, ఎర్రవెల్లి ప్రవీణ్, తరణి భాస్కర్, జయశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీ దగ్గర్లో 40 అడుగుల కాళీ మాత సెట్ వేసి వంద మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

పీఎంకే ఇంటెర్నేషనల్స్ , చేతన్ చేను ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషిని సహోతా కథానాయిక. అనూప్ శర్మ విలన్ గా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

NTR30 షూటింగ్ ఎప్పుడంటే?

పిక్ టాక్ : బాబోయ్ ఇవేం అందాలండోయ్

పవిత్రాతో పెళ్లి.. నరేశ్ మెయిన్ ప్లాన్ అదే

- Advertisement -