తెలంగాణకు సరిపోయే టీకాలు అందిస్తాం: భారత్ బయోటెక్

200
somesh
- Advertisement -

మే 1 నుండి 18 సంవత్సరాలు నిండిన వారందరికి కరోనా టీకా అందించనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభంకానుండగా రాష్ట్రానికి సరిపోయేంత టీకాలు అందిస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. బీఆర్కే భ‌వ‌న్‌లో భార‌త్ బ‌యోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మావేశం అయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి సరిపోయేంత టీకాలు అందిస్తామని వెల్లడించారు భారత్ బయోటెక్ సీఈవో కృష్ణ ఎల్ల. అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు భార‌త్ బ‌యోటెక్ ఎండీతో స‌మావేశమైనట్టు తెలిపారు. అంద‌రికీ ఉచితంగా టీకా ఇవ్వాల‌ని సీఎం నిర్ణ‌యించారన్నారు. వీలైన‌న్నీ ఎక్కువ డోసులు రాష్ర్టానికి ఇవ్వాల‌ని కోరారు. భార‌త్ బ‌యోటెక్ ఎండీ సానుకూలంగా స్పందించారు.

- Advertisement -