భరత్ ప్రచారం… హైదరాబాద్‎లోనే 3 కోట్లు ఖర్చు..

232
- Advertisement -

మహేష్ బాబు తాజా చిత్రం‘ భరత్ అనే నేను‘ అనే చిత్రం ఈనెల 20న విడుదల అవుతున్న సంగతి తెసిందే. చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ బిజీ బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక్క హైదరాబాద్ లోనే హోర్డిండ్స్ ద్వారా ప్రచారానికి 3 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్ర ప్రచారానికి డీవీవీ దానయ్య భారీస్థాయిలో ఖర్చుచేస్తున్నారట. హైదరాబాద్ నలుమూలల్లో భరత్ అనే నేను మూవీ పోస్టర్ కనిపించేలా ఖర్చు చేస్తున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.

Bharat Ane Nenu to spend Rs 3 crore on promotions

మరోవైపు మహేష్ బాబు కూడా రేపటి నుంచి భరత్ ప్రమోషన్స్ లో పాల్గొననున్నారని సమాచారం. భారీ స్థాయిలో ఓపినింగ్స్ రాబట్టేందుకు చిత్ర యూనిట్ ప్ల్యాన్ చేస్తుంది. ఓపెనింగ్ వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డును ఏర్పరుస్తుందని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.

 ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్లు దాటుతుందని పిలింనగర్‎లో టాక్ వినిపిస్తోంది. మరీ ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో చూడాలి మరీ. ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా మహేష్ అలరిస్తాడని కొరటాల శివ తెలియజేశారు. దేవిశ్రీ సంగీతం, కైరా అద్వాని అందం ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయట.

- Advertisement -