వర్మ స్టైల్‌లో ‘భైరవగీత’ ట్రైల‌ర్‌..

230
- Advertisement -

వివాదాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మకి కొన్నాళ్ళుగా స‌రైన స‌క్సెస్ రావ‌డం లేదు. తన హోమ్ బేనర్ కంపెనీ ప్రొడక్షన్స్ పై కింగ్ నాగార్జున హీరోగా ఆఫీసర్ చిత్రాన్ని నిర్మించారు. కానీ వర్మకి ఆ సినిమా నిరాశ పరచింది. దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్న వర్మ తాజాగా ‘భైరవగీత’ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సిద్ధార్థ దర్శకత్వంలో రూపొందింది. ధనుంజయ .. ఇర్రా జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Bhairava Geetha Movie Trailer

సీమలోని ఒక గ్రామం .. ఆ గ్రామంలోని ఒక ప్రేమికుల జంట .. ఆ జంటను విడదీసేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నాలు .. వాళ్లను ధైర్యంగా ఆ ప్రేమికుడు ఎదుర్కోవడం ప్రధానంగా ఈ టీజర్‌ను కట్ చేశారు. “ఎవ్వరినీ ఇడిసి పెట్టొద్దూ .. ఏడిపిద్దాం .. ఒక్కొక్కణ్ణి చంటిపిల్లల్లా గుక్కపట్టి ఏడ్చేలా ఏడిపిద్దాం .. ఆళ్ల రక్తంతో ఈ సీమకి అభిషేకం చేద్దాం’ అని కథానాయకుడు చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అభిషేక్ నామా .. భాస్కర్ రాశి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -